KTR on Block Chain Technology: పోలిస్స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి పోలీస్స్టేషన్గా ఫిరోజాబాద్ నిలిచిందన్న కథనం ఆధారంగా కేటీఆర్ ఈ సూచన చేశారు.
పోలీస్స్టేషన్లలో ఆ టెక్నాలజీ ఉపయోగించాలి: మంత్రి కేటీఆర్ - use block chain technology in police station
KTR on Block Chain Technology: పోలీస్స్టేషన్లో జవాబుదారీతనం ఉండేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి పోలీస్స్టేషన్గా ఫిరోజాబాద్ నిలించిందన్న ఆయన.. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో ఈ టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు.
KTR
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఆయన సూచించారు. జవాబుదారీతనం ఉండేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడని సాంకేతిక ఏదైనా నిరుపయోగమని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తుంటారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవీ చదవండి: