హైదరాబాద్ మాదాపూర్ ఓ ప్రైవేట్ హోటల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇమేజ్ తొలి సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి ప్రారంభించారు. గేమింగ్, వీఎఫ్ఎక్స్, ఏఐ, యానిమేషన్ రంగాల్లో చేయూత ఇవ్వడానికి ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
గేమింగ్ అడ్డాగా హైదరాబాద్: జయేష్ రంజన్ - IT Department Principal Secretary Jayesh ranjan Started Game zone
యానిమేషన్, గేమింగ్ రంగంలో హైదరాబాద్ దూసుకెళుతోందని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరాయని... మరో కొత్త ఆవిష్కరణకు అడ్డాగా మారుతోందని తెలిపారు. మాదాపూర్లో ఓ గేమింగ్ సంస్థకు సంబంధించిన ఇమేజ్ సెంటర్ను ప్రారంభించారు.
గేమింగ్ అడ్డాగా హైదరాబాద్: జయేష్ రంజన్
ఈ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం 30 అంకుర సంస్థలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఐదేళ్లలో మరిన్ని సదుపాయాల కల్పనకు 19కోట్ల 68 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అనంతరం జయేష్ రంజన్ సమక్షంలో పలు సంస్థలు ఏంఓయూలు కుదుర్చుకున్నారు.
ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!
TAGGED:
గేమింగ్ అడ్డాగా హైదరాబాద్