కాకతీయ, వరదకాలువల మధ్యనున్న 26వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మోతె జలశాయం నుంచి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని పొలాలకు నీరివ్వాలని గతంలో నిర్ణయించి గుత్తేదారుతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దానికి బదులు వరద కాలువ నుంచి కాలువల నెట్ వర్క్ ద్వారా సాగునీరందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జలాశయ నిర్మాణం కోసం గతంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసింది.
కాల్వల నెట్వర్క్ ద్వారా 26వేల ఎకరాలకు సాగునీరు - irrigation water for karimnagar district through canal network
కాకతీయ, వరదకాలువల మధ్యనున్న 26 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రూ.248.41 కోట్లతో ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలపగా.. నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![కాల్వల నెట్వర్క్ ద్వారా 26వేల ఎకరాలకు సాగునీరు irrigation water for twenty six thousand acres through canal network in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8590634-877-8590634-1598608123398.jpg)
కాల్వల నెట్వర్క్ ద్వారా 26వేల ఎకరాలకు సాగునీరు
వరదకాలువ నుంచి 26,482 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం 248.41 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.