తెలంగాణ

telangana

ETV Bharat / state

రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ బోరబండ శివాజీనగర్‌లో గత రాత్రి జరిగిన రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. స్వయంగా డీసీపీ పద్మజ రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

By

Published : Aug 13, 2019, 5:24 PM IST

హత్య జరిగిన ప్రదేశం

రౌడీ షీటర్‌ నరసింహదాసు గౌడ్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్​ బోరబండ శివాజీనగర్​లో నరసింహదాసు గౌడ్‌ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిపై వివిధ పోలీసు స్టేషన్లల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు సీరియస్​గా తీసుకున్న డీసీపీ పద్మజా స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నరసింహదాసు గౌడ్‌పై పహాడీ షరీఫ్‌ ఠాణాలో రౌడీ షీట్‌ ఉన్నట్లుగా డీసీపీ తెలిపారు. ఎస్​ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లోనూ ఒక హత్య కేసుతోపాటు 13కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు.

రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details