తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రధాన గ్రూపుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనాకు భయపడుతున్నా.. విద్యార్థులపై ఆ మహమ్మారి ప్రభావం పడకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 4న ప్రారంభమైన పరీక్షలు 14 రోజులపాటు జరిగాయి. పరీక్షలు అన్నీ ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్ద సందడి వాతావరణం కన్పించింది.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు బయటకు వస్తూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలన్నీ విద్యార్థులతో సందడిగా మారాయి. ఓ వైపు వీడిపోతున్నామనే బాధ , మరో వైపు పరీక్షలు అయిపోయాయనే ఆనందంతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ తమ ఇళ్లకు బయలుదేరారు.
ఇదీ చదవండిఃదిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..
Last Updated : Mar 18, 2020, 2:58 PM IST