రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్-1 ప్రశ్నపత్రం 'సెట్-ఏ'ను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా... మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది.
ఇంటర్ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.