తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2020, 12:21 PM IST

ETV Bharat / state

ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్​ క్రిస్మస్ వేడుకలు

ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్​ 27 ఏళ్ల వేడుకలు ఘనంగా ఘనంగా నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇజ్రాయెల్ ద్వారా గుర్తింపు పొందిన మొదటి సంస్థ ఇదేనని సినీ నటుడు రాజా పేర్కొన్నారు.

indo israel christmas celebrations in secunderabad in hyderabad
ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్​ క్రిస్మస్ వేడుకలు

ఇజ్రాయెల్ ద్వారా గుర్తింపు పొందిన మొదటి సంస్థగా ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్​కు గుర్తింపు ఉందని సినీనటుడు రాజా తెలిపారు. ఈ అసోసియేషన్ ఏర్పడి 27 ఏళ్లు అయిన సందర్భంగా సికింద్రాబాద్​లో వేడుకలు నిర్వహించారు. ఛైర్మన్ ఆడం రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇజ్రాయెల్​ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు పొందిన వారికి ధ్రువపత్రాలు అందించారు. వాణిజ్య, విద్య, వైద్య రంగాలన్నింటిలో ఇజ్రాయెల్​తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

దాదాపు 300 మంది అసోసియేషన్​లో ఉండడం గొప్ప విషయమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. భారతదేశంలోని క్రిస్టియన్​లు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక రంగాల్లో లాభాలను పొందే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాజాతో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఖమ్మం బల్దియా పోరుకు తెరాస కసరత్తు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details