తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 10:57 PM IST

ETV Bharat / state

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ రేపు పున:ప్రారంభం

కరోనా కారణంగా ఏడునెలల పాటు మూసివేసిన ఏపీలోని విశాఖ ఇందిగాంధీ జూలాజికల్ పార్క్​ను మంగళవారం తెరవనున్నారు. ఈ మేరకు సందర్శకులకు అనుమతినిస్తూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ రేపు పున:ప్రారంభం
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ రేపు పున:ప్రారంభం

ఏపీలోని విశాఖలో కరోనా నిబంధనల కారణంగా ఏడునెలల పాటు మూసేసిన ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్​ మంగళవారం తెరుచుకోనుంది. జంతుప్రదర్శనశాలలో సందర్శకులకు అనుమతినిస్తూ అటవి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సందర్శకులు నేరుగా కౌంటర్ల ద్వారా లేదా ఆన్ లైన్​లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

సందర్శకులు కొవిడ్ నియామాలు పాటించాలని తెలిపారు. ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. జూ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్కాన్ , శానిటైజర్ అందుబాటులో ఉంచారు. జూ అధికారిక వెబ్ సైట్​లో కూడా టికెట్లను పొందవచ్చునని, విశాఖ జూ క్యూరేటర్ నందిని సలారియా ప్రకటించారు.

ఇదీ చదవండి:గ్రేటర్ పోటీకి ఒక్కరోజే రెండొందల దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details