రోజురోజుకు ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ మానసిక సమస్యలు అదే స్థాయిలో ఉద్ధృతమవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బెంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సైకియాట్రిక్ సొసైటీ 53వ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈటల - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బెంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ వార్షిక సదస్సులో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సరైన సమయంలో మానసిక సమస్యలను గుర్తించడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు.

సైకియాట్రిక్ సొసైటీ 53వ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈటల
కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో వెబినార్ రూపంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఐదు రాష్ట్రాలకు చెందిన 1300 మంది సైకియాట్రిస్టులు పాల్గొన్నారు. సరైన సమయంలో మానసిక సమస్యలను గుర్తించడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. సైకియాట్రిస్టుల సంఖ్య గణనీయంగా పెరగాలన్న మంత్రి ప్రభుత్వాసుపత్రుల్లో సైకియాట్రిస్ట్ల నియామకాలను ప్రోత్సాహిస్తామన్నారు.