రాగల మూడ్రోజులు రాష్ట్రంలో చిరుజల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వెల్లడించారు.
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు - telangana rain updates
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనమే దీనికి కారణమని ప్రకటించింది.
![రాగల మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు rains in telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9046060-775-9046060-1601806633508.jpg)
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లోనూ సుమారుగా అక్టోబర్ 9 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.