తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశాభివృద్ధిలో ప్రధానిది కీలక పాత్ర: కిషన్​రెడ్డి

దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్రమోదీ కీలక కృషి చేస్తున్నారని... ట్రిపుల్​ తలాక్,​ ఆర్టికల్​ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలన్నో తీసుకుని భారతదేశ ఖ్యాతిని పలు దేశాలకు చాటిచెప్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. లాలాపేట్​లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానంలో పాల్గాన్నారు.

By

Published : Aug 18, 2019, 12:25 PM IST

దేశాభివృద్ధిలో ప్రధానిది కీలక పాత్ర: కిషన్​రెడ్డి

దేశ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాక, లాలాపేట్​లో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో భారతదేశం ఒక శక్తిమంతమైన దేశంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.

దేశాభివృద్ధిలో ప్రధానిది కీలక పాత్ర: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details