తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు వేయండి... కొత్త మార్పును తీసుకురండి' - ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి... బంగారు తెలంగాణను తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యావేత్త, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మహమూద్​ అలీ తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

independent mlc candidate campaign at kachiguda
'ఓటు వేయండి... కొత్త మార్పును తీసుకురండి'

By

Published : Feb 15, 2021, 2:27 PM IST

రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాచిగూడ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... స్వతంత్ర అభ్యర్థి మహమూద్​ అలీ ప్రచారం చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్​గా పనిచేశానని, ప్రస్తుతం హైకోర్టులో అడ్వకేట్​గా విధులు నిర్వహిస్తున్న అనుభవం తనకు ఉందని అలీ తెలిపారు. ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు బాగా తెలుసని... ఎన్నికల్లో గెలిపిస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరూ ఓటు వేసి... మార్పును తీసుకురావాలని సూచించారు.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

ABOUT THE AUTHOR

...view details