Income Tax Refund Scam Telangana :దేశవ్యాప్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ రీఫండ్ తీసుకున్న ఐటీ రిటర్న్దారులు, రిటర్న్లు దాఖలు చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆదాయపన్ను ప్రాక్టీషనర్లను ఐటీశాఖ విచారిస్తోంది. ఈ మేరకు టీడీఎస్ రీఫండ్ తీసుకున్న వారికి ఆదాయపన్ను అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల టీడీఎస్ రీఫండ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఐటీశాఖ.. కొన్నింటిని లోతుగా పరిశీలించగా అక్రమాలు వెలుగు చూశాయి. తప్పుడు సమాచారంతో రీఫండ్ తీసుకున్న వారిని గుర్తించే పనిని అధికారులు ప్రారంభించారు. రిటర్న్లు దాఖలుచేసిన వారితో పాటు ఇప్పటికే రీఫండ్ తీసుకున్న వారి దస్త్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలో సాగుతోంది. లోపాలను గుర్తించిన వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
Income Tax Frauds Telangana :దేశం మొత్తం పరిశీలన జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి ఎక్కువ ఉన్నట్లు ఐటీ అధికారులుతెలిపారు. ప్రధానంగా ఇక్కడ ఐటీ, పార్మాష్యూటికల్స్ కంపెనీలు అధికంగా ఉండడం, అందులో పని చేస్తున్న లక్షలాది మందిలో భారీ మొత్తాలు వేతనాలు తీసుకునే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికి చెందిన ప్రతి ఏడాది మినహాయింపులు పోను అదనపు ఆదాయంపై సంబంధిత కంపెనీలు నేరుగా టీడీఎస్ కట్ చేస్తాయి. ఆ తరువాత ఆ ఫాం 16తో పాటు ఎల్ఐసీ, గృహరుణాలు, విద్యారుణాలు, రాజకీయ పార్టీలకు విరాలాలు, ప్రావిడెండ్ఫండ్, హ్యాండీక్యాప్డ్ అల్వెన్స్లు ఇలా వివిధ రకాల మినహాయింపులను అప్లోడ్ చేసి.. అప్పటికే కంపెనీల నుంచి చెల్లించిన టీడీఎస్ మొత్తాలను రీఫండ్ తీసుకుంటున్నారు.