తెలంగాణ

telangana

ETV Bharat / state

రెచ్చిపోతున్న భూ ఆక్రమణదారులు.. అడ్డుకట్ట వేసేదెలా..? - special article on government lands in Hyderabad

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. మహానగరంలో భూముల ధరలు కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. అనధికార లెక్కల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు రూ.5000 కోట్ల భూమి ఆక్రమణలకు గురై ఉంటుందని అధికారుల అంచనా.

Illegals occupying government lands in Hyderabad
రెచ్చిపోతున్న భూ ఆక్రమణదారులు.. అడ్డుకట్ట వేసేదెలా..?

By

Published : Mar 13, 2021, 9:11 AM IST

హైదరాబాద్‌ జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల్లో సుమారు 1400-1450 వరకూ వివిధ న్యాయస్థానాల్లో భూ సంబంధింత కేసులు ఉంటాయని అంచనా. హైదరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఒక దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు దుకాణాలు నిర్మించారు. దీనిపై స్థానికులు కలెక్టర్‌కు వినపతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఫిర్యాదుదారులు తెలిపారు.

గతంలో ఓ తహసీల్దార్‌ చెరువు భూమికి ప్రైవేటు స్థలంగా ధ్రువీకరణపత్రం మంజూరు చేశారు. ఒకే భూమికి రెవెన్యూ అధికారులు వేర్వేరు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటాన్ని గుర్తించిన న్యాయస్థానం.. వాస్తవాలను గుర్తించమని కలెక్టర్‌ను ఆదేశించటంతో అసలు విషయం వెలుగుచూసింది. సమస్యను అధిగమించేందుకు కలెక్టర్‌ శ్వేతా మహంతి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ల్యాండ్‌బ్యాంక్‌ వివరాల నమోదుకు యాప్‌ తయారు చేసి సుమారు 1300 స్థలాల వివరాలను నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details