తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2020, 7:04 PM IST

ETV Bharat / state

అరుణాచల్​ ప్రదేశ్​ నుంచి అక్రమమద్యం సరఫరా

ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో... కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇలా తీసుకొస్తున్న మద్యం సీసాలను కృష్ణా జిల్లా మంతెనలో ఏపీ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

illegal-liquor-seized-in-manthena-krishna-district of Andhra Pradesh
అక్రమ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్​లోకి తరలిస్తున్న మద్యాన్ని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన వీరంకి వెంకట రమణ మొక్కజొన్న లోడు లారీలో 142 కేసుల మద్యం తరలించాడు.

వాటిలో కొన్నింటిని ఇతరులకు అమ్మగా... గన్నవరం మండలంలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలో అవి బయటపడ్డాయి. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటరమణ గడ్డివాముల కింద దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత

ఇదీ చూడండి : జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details