కరీంనగర్, వరంగల్ నగరాల్లో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందం హైదరాబాద్లో వినోద్కుమార్తో సమావేశమైంది. వరంగల్, కరీంనగర్లో కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాల ద్వారా బయోగ్యాస్, బయోమాన్యూర్లు ఉత్పత్తి చేసే విషయమై సమావేశంలో చర్చించారు.
వ్యర్థాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని.. బయోగ్యాస్, బయోమాన్యూర్ ఉత్పత్తితో ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు.