ఉస్మానియా విశ్వవిద్యాలయం భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని.. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నకిలీ పత్రాల ఆధారంగా కొందరు నిర్మాణ అనుమతులకు ప్రయత్నిస్తున్నారని, వారికి అనుమతులు ఇవ్వొద్దని, ఓయూను కబ్జాదారుల నుంచి కాపాడాలని రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, వీసీ ఓఎస్డీ కృష్ణారావు... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్కు లేఖ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ ఓయూ పరిధిలోని డిడి కాలనీలో తులసి కోపరేటింగ్ హోసింగ్ సోసైటీకి ఉస్మానియా యూనివర్సిటీకి మధ్య ఏర్పడిన స్థలం వివాదంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం 4800 చదరపు గజాల స్థలాన్ని ఆ సొసైటీకి ఇచ్చినట్లు తెలిపారు. తదనుగుణంగా 4800 చ.గ. భూమిని సొసైటీ వారు లే అవుట్ చేసి 13 మందికి విక్రయిoచారు.
కుట్ర పూరితంగా తప్పుడు పత్రాలు