తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2020, 10:01 AM IST

ETV Bharat / state

హైదరాబాద్ మెట్రోకు అనుమతి వస్తే ప్రయాణం ఇలా ఉంటుంది!

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు కేంద్రం అనుమతించింది. కొవిడ్‌ పరిస్థితులను బట్టి అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ మెట్రోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెలువరించలేదు. అనుమతి లభిస్తే.. దాదాపు ఇవే విధి విధానాలు ఉండొచ్చు!

Hyderabad Metro
Hyderabad Metro

అన్‌లాక్‌ 4.0లో భాగంగా సెప్టెంబరు 7 నుంచి మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ పరిస్థితులను బట్టి అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో నడపాలా? వద్దా అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెలువరించలేదు. ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం మెట్రోలు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)ని విడుదల చేసింది.

హైదరాబాద్‌లోనూ నడిపేందుకు అనుమతి లభిస్తే.. దాదాపు ఇవే విధి విధానాలు ఉండొచ్చని మెట్రో వర్గాలు అంటున్నాయి. ఇందులో డిజిటల్‌ చెల్లింపుల ద్వారానే మెట్రో యానం ప్రధానం.

విధివిధానాలు ఇలా ఉండొచ్చు...

నగదు రహితం:స్మార్ట్‌ కార్డులతోనే ప్రయాణానికి అనుమతి. రూ.50తో ఈ కార్డు తీసుకోవచ్చు. రూ.20 డిపాజిట్‌ కింద మినహాయిస్తారు. మిగతాది ప్రయాణ ఛార్జీకి వాడొచ్చు. కార్డులను డిజిటల్‌ చెల్లింపులతోనే కొనాలి.

స్పర్శ రహితం: కార్డుతో పనిలేకుండానే మెట్రోలో క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ విధానమూ ఉంది. టీసవారీతో పాటు వేర్వేరు యాప్‌ల నుంచి టికెట్‌ బుక్‌ చేసుకుంటే మొబైల్‌కు క్యూఆర్‌కోడ్‌ వస్తుంది. వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఇది చూపిస్తే గేట్లు తెరుచుకుంటాయి.

మార్గాలు కుదింపు:ప్రవేశ మార్గాలన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. థర్మల్‌ స్క్రీనింగ్‌, చేతులు శుభ్రం చేసుకున్నాకే ప్రవేశం. మాస్క్‌ తప్పనిసరి. కోచ్‌లో ఒక సీటు వదిలి కూర్చోవాలి. మార్కింగ్‌ ప్రకారమే నిలబడాలి. స్టేషన్‌లో రైలు ఆగే సమయం అర నిమిషం నుంచి రెండు నిమిషాలు పెరగొచ్చు.

లిఫ్ట్‌లో:లిఫ్ట్‌లో ముగ్గురికే అనుమతి.

ABOUT THE AUTHOR

...view details