తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎం-కేర్స్‌ ఫండ్‌కి ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ విరాళం! - పీఎం-కేర్స్‌ ఫండ్‌కి ఐడీపీ కంపెనీ విరాళం!

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌ ఫండ్‌కు.. ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 51.14 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ కంపెనీ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్లు.. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై కు చెక్కును అందించారు.

IDP Pvt Ltd makes a huge donation to PM-Cares Fund
పీఎం-కేర్స్‌ ఫండ్‌కి ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ భారీ విరాళం!

By

Published : May 21, 2020, 8:59 AM IST

పీఎం కేర్స్ ఫండ్ కు.. హైదరాబాద్ కు చెందిన ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు కలిసి రూ. 51.14 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆ కంపెనీ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ విజయ్ లు గవర్నర్ తమిళిసై కు చెక్కును అందజేశాారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో.. ఉద్యోగులు విరాళంగా ఇచ్చిన మొత్తానికి సమానంగా యాజమాన్యం చెక్కును ఇవ్వడం పట్ల గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులను ప్రశంసించారు.

ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details