తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్చనీయాంశంగా మారిన స్మితా సభర్వాల్ ట్వీట్ - స్మితా సభర్వాల్ తాజా వార్తలు

IAS Smita Sabharwal Tweet : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తన కెరీర్​పై చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె ఎక్స్​లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారుల బదిలీలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Social Media Trolling On IAs Officer Smita Sabharwal Tweet
IAS Smita Sabharwal Tweet

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 3:46 PM IST

Updated : Dec 13, 2023, 7:54 PM IST

IAS Smita Sabharwal Tweet : ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఎక్స్​(ట్విట్టర్)లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సివిల్ సర్వీసెస్​కు ఎంపికై 23 ఏళ్లు అయిన సందర్భంగా ఎక్స్​లో పోస్ట్ చేసిన స్మితా సభర్వాల్ కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయని పోస్ట్ చేశారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన స్మితా సభర్వాల్ కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పోస్ట్ చేశారు.

సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలి : భట్టి విక్రమార్క

Social Media Trolling On IAs Officer Smita Sabharwal Tweet : తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్, రజత్ కుమార్ పదవీ విరమణ అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. రాష్ట్రంలో డైనమిక్ అధికారిణిగా స్మితా సభర్వాల్‌‌కు ప్రత్యేక పేరుంది.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్మితా సభర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పలువురు సీనియర్ అధికారులు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొత్త మంత్రులను కలుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు స్మితా సభర్వాల్ ఎవరిని కలవలేదు, పైగా ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు కూడా హాజరు కాలేదు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.58 వేల కోట్లు అవసరం - కాళేశ్వరానికి కావాల్సింది రూ.17,852 కోట్ల

బీఆర్​ఎస్ ప్రభుత్వంలో సీఎం పేషీలో స్మితా సభర్వాల్ కీలక అధికారిణిగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అధికారుల బదిలీ చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, ఇంటెలిజెన్స్ చీఫ్​ల బదిలీలు చేపట్టారు. తన పేషీలో ఇద్దరు సీనియర్ అధికారులను నియమించుకున్నారు. కేసీఆర్ హయాంలో సీఎం పేషీలో ఉన్న వారిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్

లోక్​సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్​రెడ్డి

Last Updated : Dec 13, 2023, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details