శివరాత్రి సందర్భంగా కోటి రూపాయలతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శివార్చన నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడను దర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ను ఆదేశించారు. వేములవాడ పురపాలక నూతన ఛైర్ పర్సన్ మాధవి, వైస్ ఛైర్మన్ మధు.. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్తో కలిసి వెళ్లి మంత్రి కేటీఆర్ను కలిశారు.
వేములవాడ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి కేటీఆర్ - 'వేములవాడ పట్టణ సంక్షేమం, ఆలయాభివృద్ధి నే చూసుకుంటా'
వేములవాడ మున్సిపాలిటీ పాలనా పగ్గాలు చేపట్టిన సందర్భంగా పుర నూతన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ పుర మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. సుపరిపాలనకే పట్టం కట్టాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించారు.

త్వరలోనే వేములవాడ అభివృద్ధిపై సమీక్ష : మంత్రి కేటీఆర్
వేములవాడ పట్టణం, ఆలయం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పురపాలకలో సుపరిపాలనకు నడుం బిగించాలని నూతన ప్రజా ప్రతినిధులకు సూచించారు.
TAGGED:
Ktr_On_Vemulavada