తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2019, 6:37 AM IST

Updated : Aug 2, 2019, 7:37 AM IST

ETV Bharat / state

'దేశానికే హైదరాబాద్ ఐటీ హబ్​గా మారింది'

​ఐసీసీలో సాఫ్ట్ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ వార్షిక ఇన్నోవేషన్ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సమ్మిట్‌లో 120కి పైగా స్టార్టప్​లు, 200కుపైగా ఐటీ పరిశ్రమ సారథులు సహా దాదాపు వెయ్యి మంది పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు రంగాల్లో రాణించిన ఐటీ కంపెనీలకు అవార్డులను అందజేశారు.

'దేశానికే హైదరాబాద్ ఐటీ హబ్​గా మారింది'

హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో సాఫ్ట్​వేర్ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ వార్షిక ఇన్నోవేషన్ సదస్సు జరిగింది. ఈ ఏడాది ఐటీ రంగంలో రాణించిన కంపెనీలకు పలు రంగాల్లో ఇండస్ట్రీ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీ.ఎస్. ఎస్.కె.జోషి, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. త్రిపురనేని హనుమాన్ చౌదరీకి లైఫ్ టైం అచీవ్​మెంట్ అవార్డు అందజేశారు. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా ఎదుగుతోన్న హైదరాబాద్​పై రిపోర్ట్ విడుదల చేశారు. ఐటీ ఎగుమతుల విభాగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా కంపెనీలు మొదటి మూడు అవార్డులను అందుకున్నాయి.

'దేశానికే హైదరాబాద్ ఐటీ హబ్​గా మారింది'
Last Updated : Aug 2, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details