తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలుష్యంపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

నగరంలో పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాం కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కాలుష్య నివారణకై ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించాలని నినాదాలు చేశారు.

By

Published : Jul 18, 2019, 7:43 PM IST

కాలుష్యం పట్ల నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ

కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బషీర్​బాగ్​లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి కాలుష్య కారకాలు, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిజాం కళాశాల అధ్యాపకులు తెలిపారు.

కాలుష్యం పట్ల నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details