తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్‌ 95 మాస్క్‌కు మించి రక్షణ కల్పించే మాస్క్‌ - daksha meditech mask

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్‌లు తప్పనిసరి చేశాయి. ప్రజలంతా సాధారణ మాస్క్‌ల నుంచి మొదలు సర్జికల్ మాస్క్‌లు ధరిస్తూ కొవిడ్‌ను దరిచేరకుండా చూసుకుంటున్నారు. అయితే ఆ మాస్క్‌లు కొవిడ్ నుంచి ఎంత వరకు రక్షణ కల్పిస్తాయి? కోట్లు పోసి వైద్యుల కోసం దిగుమతి చేసుకుంటోన్న ఎన్‌ 95 మాస్క్‌లు ఎంత వరకు భద్రతనిస్తాయి ? ఈ ప్రశ్నలే హైదరాబాద్‌కు చెందిన ఓ యువకున్ని ఆలోచనలో పడేశాయి. దానికి మించి మాస్క్‌లు తయారు చేశాడు.

mask
mask

By

Published : May 13, 2020, 2:17 PM IST

కరోనా వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతున్న వేళ... వైరస్ నుంచి రక్షణ కోసం పౌర సమాజం రకకాల మాస్క్‌లను వినియోగిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించడంలో మాస్క్‌ల పాత్ర కీలకం కావడంతో ప్రభుత్వాలు తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేశాయి. సాధారణ మాస్క్‌లతో పోలిస్తే ఎన్ 95 మాస్క్‌లు ఖరీదు ఎక్కువ. కొవిడ్ ప్రారంభంలో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్ 95 మాస్క్‌లను మన దేశం దిగుమతి చేసుకుంది. కరోనా బాధితులకు అతిసమీపంలో ఉన్న వైద్యులతోపాటు అన్ని ఆస్పత్రులు, సిబ్బందికి అందుబాటులో ఉంచారు. కానీ సాధారణ పౌరులు కూడా ఎన్ 95 మాస్క్‌లు వాడుతుండటంతో కొరత ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన యువ ఇంజినీర్ వీరభద్రం... మేక్ ఇన్ ఇండియా నినాదంతో బాలనగర్‌లోని దక్షా మెడిటెక్ కంపెనీలో ఎన్ 95 మాస్క్‌లకు ప్రత్యమ్నాయంగా ఉండి పూర్తి రక్షణ కల్పించే మాస్క్‌లకు శ్రీకారం చుట్టాడు.

పునర్వినియోగించుకునేలా

ఎన్ 95 మాస్క్‌లో ఉన్న అన్ని అంశాలు తాను తయారుచేసే మాస్క్‌లోనూ పొందుపర్చాడు. 5 కీలక అంశాల ఆధారంగా మాస్క్‌లను తయారుచేసిన వీరభద్రం... తన స్నేహితురాలు దీప్తి సాయంతో వాటిని పునర్వినియోగం చేసుకునేలా సరికొత్తగా తీర్చిద్దాడు. మనం సాధారణంగా వాడే మాస్క్‌లు నూటికి నూరు శాతం కొవిడ్ నుంచి రక్షణ కల్పించలేవని గుర్తించిన దీప్తి, వీరభద్రం... వాటికి పీఎం 2.5 ఫిల్టర్ పేపర్, రెసిప్రేటరీ వాల్వూను జోడించారు. టెక్స్ టైల్ ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో కాపర్ ఇంపెగ్ర్నేషన్ పద్ధతిలో మాస్క్ ముందుభాగాన్ని కాపర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు.

3 నుంచి 4 నెలలు వాడొచ్చు

ఈ మాస్క్ ధరించిన వ్యక్తి బయటకువెళ్లినప్పుడు ఏదైన బ్యాక్టిరియా, వైరస్‌లు మాస్క్‌పై పడినప్పుడు శరీరంలోకి వెళ్లకుండా కాపర్ లేయర్ అడ్డుకుంటుంది. పూర్తి పర్యావరణహితంగా తయారైన ఈ రీయూజబుల్ మాస్క్‌లు 3 నుంచి 4 నెలలు వినియోగించవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఈ కాపర్ ఫ్యాబ్రిక్ మాస్క్ కోసం సిట్రా అనుమతి లభించగా... ఐసీఎంఆర్ తోపాటు అమెరికాలోని నెల్సన్ ప్రయోగశాలకు దీప్తి, వీరభద్రం తమ ప్రతిపాదనలు పంపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో

బాలానగర్‌లోని దక్షా మెడిటెక్ కేంద్రంగా కాపర్ ఫ్యాబ్రిక్ మాస్క్‌లను తయారుచేస్తోన్న వీరభద్రం... సమీపంలోని పలు పరిశ్రమలకు ఉపాధి మార్గాన్ని చూపాడు. మాస్క్‌లో వినియోగిస్తున్న ఫ్యాబ్రిక్స్‌ను స్థానికంగా ఉత్పత్తయ్యేలా చూస్తూ ఆదాయాన్ని సమకూరుస్తున్నాడు. ఉపాధి లేక వెలవెలబోతున్న టైలర్లకు మాస్క్‌ల తయారీని అప్పగించి భరోసా కల్పిస్తున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాపర్ ఫ్యాబ్రిక్ మాస్క్‌ల తయారీ కాకుండా... శానిటైజర్‌ను సరికొత్తగా వినియోగించేలా పరికరాన్ని తయారుచేశాడు. మానవ రహితంగా శానిటైజర్ వినియోగించేలా శానిటైజర్ స్టాండ్‌ను తయారుచేసి గృహసముదాయాలు, పోలీస్ స్టేషన్లు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తూ ప్రశంసలందుకుంటున్నాడు.

ఎన్‌ 95 మాస్క్‌కు మించి రక్షణ కల్పించే మాస్క్‌

ఇదీ చదవండి:హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం

ABOUT THE AUTHOR

...view details