కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. వైరస్ కారణంగా గత కొంత కాలంగా నిలిచిపోయిన హైదరాబాద్- శ్రీశైలం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తిరిగి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి రివర్ క్రూయిజ్లో శ్రీశైలం వెళ్లేందుకు ఈ ప్యాకేజీ డిజైన్ చేశారు. రెండు రోజుల ఈ టూర్కి పెద్దవారికి రూ. 3,499, పిల్లలకు రూ. 2800 చొప్పున వసూలు చేయనున్నట్టు వివరించారు.
ఈ టూర్లో భాగంగా నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం ఆలయం, సాక్షి గణపతి ఆలయం, శ్రీశైలం డ్యామ్ సైట్, పాతాళగంగ, ఫరీదాబాద్ అడవులను చూపనున్నారు. ఈ ప్యాకేజీలో రవాణాతో పాటు.. ఆహారం, రాత్రి బస ఉంటుందని పేర్కొన్నారు.