తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో జోరు.. రోజుకో కొత్త రికార్డు.. - tsrtc strike news

ఆర్టీసీ సమ్మెతో మెట్రో పంట పడింది. రికార్డ్ స్థాయి ప్రయాణికులతో మెట్రో పరుగులు తీస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటల వరకు 3 లక్షల 63 వేల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

రద్దీ దృష్ట్యా ప్రతీ 3.5 నిమిషాలకు ఒక రైలు : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

By

Published : Oct 14, 2019, 11:44 PM IST


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజు రోజుకు మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల వరకు 3 లక్షల 63 వేల మంది ప్రయాణించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు ఈ సంఖ్య 3 లక్షల 80 వేల వరకు చేరుతుందని అంచనా వేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గతంలో కంటే 100 ట్రిప్పులు పెంచారు. ఫలితంగా ప్రస్తుతం రోజూ 810 ట్రిప్పులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ 3.5 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

రద్దీ దృష్ట్యా ప్రతీ 3.5 నిమిషాలకు ఒక రైలు : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details