హైదరాబాద్ పాతబస్తీలో మెట్రోరైల్ పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ను మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను అక్బరుద్దీన్ కలిశారు. పాతబస్తీతో మెట్రో రైల్ను అనుసంధానించాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
త్వరలో పాతబస్తీకి మెట్రో: సీఎం కేసీఆర్ - cm kcr on oldcity metro
పాతబస్తీలో మెట్రోరైలు పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ను అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీకి మెట్రోరైలు అనుసంధానించాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పాతబస్తీలోనూ మెట్రో రైల్ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
![త్వరలో పాతబస్తీకి మెట్రో: సీఎం కేసీఆర్ akbaruddin meet kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6015444-566-6015444-1581254978817.jpg)
akbaruddin meet kcr
త్వరలో పాతబస్తీకి మెట్రో: సీఎం కేసీఆర్
త్వరలోనే మెట్రో రైల్ పనులు ప్రారంభమవుతాయని అక్బరుద్దీన్తో సీఎం పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని సీఎం చెప్పారు.
ఇదీ చూడండి:మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్
Last Updated : Feb 9, 2020, 8:49 PM IST