తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు - న్యాయవాదుల వార్తలు

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యను బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ఖండించింది. విధులు బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు నిరసనలు చెపట్టారు. దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. న్యాయవాదుల హత్యపై స్పందించిన హైకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.

hyderabad lawyers  protest against on vaman rao couple murder
న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు

By

Published : Feb 18, 2021, 4:46 PM IST

వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా బార్‌కౌన్సిల్‌ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి న్యాయస్థానాల ముందు ఆందోళనకు దిగింది. హైకోర్టులోనూ బార్‌ అసోషియేషన్‌ పిలుపు మేరకు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి కోర్టుల్లో విధులు బహిష్కరించారు. నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ.. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ గళమెత్తారు. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట రహదారిపై లాయర్లు బైఠాయించారు. ధర్నాతో ఎల్బీనగర్-దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతు తెలిపారు.

న్యాయవాదుల హత్యకు నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్ల ఆందోళన చేపట్టారు. సివిల్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు.. రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. సైఫాబాద్ సమీపంలో లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు ధర్నా చేశారు.

ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details