తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహానికి చికిత్స... యశోద ఘటనపై విచారణ కమిటీ - మలక్​పేట యశోద ఆస్పత్రిపై విచారణ కమిటీ

హైదరాబాద్​ మలక్‌పేట యశోద ఆస్పత్రిలో శ్వేతారెడ్డి మృతిపై విచారణకు కమిటీని హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో ఏర్పాటు చేసింది. చికిత్స కోసం రూ.29 లక్షలు వసూలు చేసినట్లు ఆస్పత్రిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. మృతదేహానికి చికిత్స చేశారన్న ఫిర్యాదుపై విచారణకు డీఎంహెచ్‌వో ఆదేశించింది. మూడు రోజుల్లో ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

enquiry
enquiry

By

Published : Sep 8, 2020, 11:00 PM IST

హైదరాబాద్​ మలక్​పేట యశోద ఆస్పత్రిపై హైదరాబాద్​ డీఎంహెచ్​వో విచారణకు ఆదేశించింది. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన శ్వేతారెడ్డి అనే మహిళకు చికిత్స కోసం రూ.29 లక్షలు వసూలు చేసి... మృతదేహం అప్పగించారనే ఫిర్యాదుపై కమిటీని ఏర్పాటు చేసింది. మూడురోజుల్లో ఘటనపై సమగ్ర విచారణ జరిపి... నివేదిక సమర్పించాలని పేర్కొంది. శాలివాహననగర్, మలక్‌పేట యూపీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ పి.వీణ, డాక్టర్ పి.జయమణిలను విచారణ అధికారులుగా నియమించింది.

ఏం జరిగిందంటే

హైదరాబాద్​లో ఏసీటీవోగా పనిచేస్తున్న శ్వేతారెడ్డి కాన్పు కోసం ఆగస్టు 4న ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయిన రెండు రోజుల తరువాత శ్వేతారెడ్డికి కొద్దిగా ఆయాసం రావడంతో కొవిడ్‌ పరీక్ష చేశారు. ఫలితం నివేదిక చూపించకుండానే పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. 20 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పరీక్షల నివేదికలు ఇస్తే... వేరే వైద్యుల అభిప్రాయం తీసుకుంటామని ఆమె భర్త అడగడంతో... మృతి చెందిందంటూ మరుసటిరోజు వైద్యులు చెప్పారని హైదరాబాద్ డీఎంహెచ్​వోకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details