కార్తికమాసం పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సీపీకి ఆలయ ఈవో అన్నపూర్ణ స్వాగతం పలికారు. అంజనీ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని.. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదని కోరుకున్నట్లు తెలిపారు.
ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న సీపీ