piligrims agitation: తెలంగాణ నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు రిషికేశ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారుల తీరు వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయిందని నిరసనకు దిగారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాధారణంగా చార్ధామ్ యాత్రకు బయలుదేరిన భక్తులు రిషికేశ్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన యాత్రికులు రిషికేశ్లోని బీటీసీ క్యాంపస్లో రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఐనా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి యాత్ర చేపడితే ఇప్పడు అనుమతించడం లేదని వారు వాపోయారు. రిజిస్ట్రేషన్ ప్రకారం వెళ్లాలంటే, అడ్వాన్స్ బుకింగ్ సమాచారాన్ని ముందుగానే తెలియపరచాలని అధికారులపై మండిపడ్డారు.