గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ శ్వేత మహంతి జాతీయ జెండాను ఎగురవేసి.. సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగాజిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
జెండావిష్కరించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి - hyderabad collector updates
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్వేత మహంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో.. జెండావిష్కరణ