హైదరాబాద్ మహానగరంలో జరగబోయే వీర హనుమాన్ శోభాయాత్రకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. శోభ యాత్ర జరిగే ప్రాంతాల్లో దాదాపుగా 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు 1200ల మంది పోలీసులతో గట్టి బందోబస్తును నిర్వహిస్తామన్నారు.
శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు
శోభాయాత్ర దారిపొడవునా మంచినీటి సౌకర్యం రోడ్ల మరమ్మతులు, శానిటేషన్కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 7:30గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని... సాయంత్రం 7 గంటలకు తాడ్ బండ్ ఆలయానికి చేరుకుంటుందని వెల్లడించారు.