తెలంగాణ

telangana

By

Published : May 13, 2021, 5:52 PM IST

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ముషీరాబాద్​లో నిరశన

ప్రజలకు కరోనా వ్యాక్సిన్​ వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని యూటీఎఫ్​ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరుతూ హైదరాబాద్​లో నిరాహార దీక్ష చేపట్టారు.

hunger strike for corona in aarogya sri
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని నిరశన

కరోనా మహమ్మారి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన నియమాలు అమలు చేయకపోవడం వల్లే కొవిడ్​ విజృంభిస్తోందని యూటీఎఫ్​ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరుతూ.. హైదరాబాద్ ముషీరాబాద్​లోని సీఐటీయూ నగర కార్యాలయంలో కొవిడ్​ వ్యాక్సిన్ చైతన్య వేదిక ప్రతినిధులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని నర్సిరెడ్డి ప్రారంభించారు.

ప్రజలకు వ్యాక్సిన్​ను అందించడంలో కూడా ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ అన్నారు. రెండో డోసు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​తో కొడుకు.. ప్రమాదంలో తండ్రి మృతి

ABOUT THE AUTHOR

...view details