తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె బాటపట్టిన పట్నం - ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బ​స్టాండ్లు, రైల్వేస్టేషన్లు - huge public at telangana bus stands

Huge Crowd At Telangana Bus Stands occasion of Sankranti : సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీని దృష్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది.

Heavy Public at Telangana Bus Stands
Huge Crowd At Telangana Bus Stands occasion of Sankranti

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 9:28 PM IST

Updated : Jan 13, 2024, 10:24 PM IST

Huge Crowd At Telangana Bus Stands occasion of Sankranti

Huge Crowd At Telangana Bus Stands occasion of Sankranti : సంక్రాంతి రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారికి వాహనాలు పోటెత్తాయి. ఆయా టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి రద్దీ నెలకొంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో ప్రయాణికులకు అవసరాలను తీరుస్తోంది.

సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్‌ ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌ జేబీఎస్​, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, లింగంపల్లి, మియాపూర్‌, కేపీహెచ్​బీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు వెళ్లేందుకు పయనం కావడంతో బస్సుల్లో రద్దీ భారీగా కనిపిస్తోంది. మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి.

హైదరాబాద్‌ - విజయవాడ రూట్​లో ఫుల్​ ట్రాఫిక్​ జామ్ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో కనీసం కాలు పెట్టే జాగ కనిపించడం లేదు. సీట్ల కోసం అతివలు పోటీపడుతున్న దృశ్యాలు ఆయా ప్రయాణ ప్రాంగణాల్లో కనిపించింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సులను నడుపుతూ ప్రజల అవసరాలను తీరుస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలోనూ సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారితో నిండిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పండుగ కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

Heavy Public at Telangana Bus Stands : సంక్రాంతి సెలవుల వల్ల ఆయా జిల్లాల్లోని బస్టాండ్లు జనంతో నిండిపోయాయి. హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ కనిపించింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడటం వల్ల స్వల్ప తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.

సంక్రాంతి ఎఫెక్ట్ - హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

ఇక సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమైన వారితో హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-కరీంనగర్‌, హైదరాబాద్‌-కర్నూలు రహదారులపై విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. ప్రధానంగా హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై వాహనాల వేగం నత్తను తలపిస్తోంది. చౌటుప్పల్‌తో పాటు కొర్లపహాడ్‌ వద్ద టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పోటెత్తాయి. ఈ రహదారి ఆరు వరుసలకు చేస్తున్న విస్తరణ పనులతో ఎల్బీనగర్‌ నుంచి చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. సాధారణంగా గంటలోపున వెళ్లే దూరానికి, రెండు గంటలకు పైగానే పడుతోంది.

ట్రాఫిక ఆంక్షలతో వాహనదారుల ఇక్కట్లు.. పోలీసుల అవస్థలు

Last Updated : Jan 13, 2024, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details