Mahashivratri Festival: మహాశివరాత్రి వచ్చేస్తోంది. చాలా మంది ఈ పర్వదినాన ఉపవాసం ఉంటారు. అయితే కొందరు పరమేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష పూనుకుంటే.. మరికొందరు బరువు తగ్గాలని ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసం ఉండాలనుకునే వారు తిండి మానేసి పస్తులు ఉండకూడదట. ఇలా చేయడం వల్ల ఉపయోగాలు కన్నా ఆరోగ్యానికి నష్టమే ఎక్కువగా జరుగుతుందని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉపవాసాలు చేసే విధానాల గురించి తెలుసుకుని వారు చెప్పిన నియమాలు పాటిస్తే.. మంచి ఫలితాలను వస్తాయి. మరి అనేంటో ఓసారి చూద్దామా..?
నిర్జలోపవాసం: కనీసం నీరు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని నిర్జలోపవాసంగా పిలుస్తారు. రోజంతా నీళ్లు తాగకుండా ఉండడం వల్ల శరీరం తన స్థితిని కోల్పోతుంది. ఆహారం తినకుండా అయినా కొన్ని రోజులు ఉండవచ్చు కానీ.. నీళ్లు తాగకుండా ఉండకూడని వైద్య నిపుణులు చెబుతారు. శరీర ఉష్ణోగ్రతలను నీరు అదుపు చేస్తుంది. అందువల్ల నీళ్లు తాగడం మానకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ నిర్జలోపవాసాన్ని పాటించకపోవడమే మంచిదని నిపుణులు భావిస్తారు.
జలోపవాసం: అన్నం, పండ్లు వంటివి తీసుకోకుండా కేవలం నీెెెెెెళ్లు మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని జలోపవాసం అంటారు. అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారు తరుచూ ఈ ఉపవాసం చేయడం వల్ల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తుంటారు. నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం. ఆ నీటిలో కాస్త నిమ్మ రసం, తేనె కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మరసంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది కరుగుతుంది. శరీరం నీరసించకుండా చేస్తుంది. ఇలా ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో 8 నుంచి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మరే ఇతర ఆహారం తీసుకోకపోయినా ఫర్వాలేదు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి దరికి చేరవు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపవేయబడతాయి.