రాష్ట్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలు, కమిషనరేట్ల నిర్మాణ పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గద్వాల, సూర్యాపేట, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, వనపర్తి, మహబూబాబాద్, రామగుండంలో నిర్మిస్తున్న భవనాలను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలని హోంమంత్రి ఆదేశించారు.
సిద్దిపేట సీపీ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం ఆధునిక మౌలిక సదుపాయాలతో 50,000 అడుగుల విశాలమైన విస్తీర్ణంతో నిర్మించడం వల్ల చక్కగా ఉన్నాయని అన్నారు. మిగిలిన భవనాల నిర్మాణం కాలపరిమితి ప్రకారం పూర్తి కావాలని, డీపీవో, సీపీవో భవనాల నిర్మాణంలో ఉన్న ప్రాంగణాల్లో అధికారుల నివాసాల కోసం ఎనిమిది చొప్పున భవనాలను నిర్మించాలని సూచించారు. అంచనాలతో పాటు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి... అనుమతి కోసం పంపాలని అన్నారు.