హుస్సేన్ సాగర్లో గుర్రపు డెక్క పేరుకుపోయింది. వేసవిలో దుర్వాసనతో పాటు దోమల సమస్యా తీవ్రంగా పెరిగిపోయింది. దీనిపై దృష్టి పెట్టిన హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు వేగవంతం చేశారు.
హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు వేగవంతం - గుర్రపు డెక్క తొలగింపు
హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు ముమ్మరం చేశారు. గుర్రపు డెక్క తొలగింపునకు రెండు యంత్రాలను ముంబయి నుంచి కొనుగోలు చేసి పనులు వేగవంతం చేశారు.
![హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు వేగవంతం hmda news, cleaning process of Hussain Sagar, hyderabad news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:44:34:1621073674-11768681-hussain.jpg)
hmda news, cleaning process of Hussain Sagar, hyderabad news
పేరుకుపోయిన గుర్రపు డెక్కను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. రెండు ప్రోటిన్ ట్రాష్ కలెక్టర్ మిషన్లను ముంబయి నుంచి కొనుగోలు చేసిన హెచ్ఎండీఏ అధికారులు.. పనులను ముమ్మరంగా చేస్తున్నారు.
ఇదీ చూడండి:'గాంధీ ఆసుపత్రి వద్ద నిత్యం వెయ్యి మందికి ఉచిత భోజనం'