జూన్ 8 తర్వాత 'పది' పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ - high court on commencement of tenth class exams
12:25 May 19
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ
జూన్ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష నిర్వహణకు హైకోర్టు అంగీకరించింది. కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్ష నిర్వహించి మర్నాడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం... పరీక్షా కేంద్రాల్లో కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
ప్రతి పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండాలని చెప్పిన హైకోర్టు... భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవద్దని సూచించిన కోర్టు... పరిస్థితి తీవ్రంగా ఉంటే అసలు పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది.