ఏపీ విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు జరిపారో.. ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని తెలిపింది. సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి..: