తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2020, 4:22 PM IST

ETV Bharat / state

వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా

వేతనలు, పింఛనులో కోతకు సంబంధించిన ఆర్టినెన్స్​పై హైకోర్టులో విచారణ జరిపింది. కోర్టులు తెరిచాక విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్​ కోరగా... ఇప్పటికే చాలా ఆలస్యమైందని పిటిషనర్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

high court hearing on pensions and salary cutting in telangana
వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా

ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, పింఛనులో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులు తెరిచాక విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోరగా... ఇప్పటికే చాల ఆలస్యమైందని పిటిషనర్​ తరఫు న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న తరువాత తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.

లాక్​డౌన్ సమయంలో ఆదాయం తగ్గినందున ఆర్థిక లోటును పూడ్చేందుకు ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు విశ్రాంత ఉద్యోగులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

ఇదీ చూడండి:సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!

ABOUT THE AUTHOR

...view details