High Court on MLAs Purchase Case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులివ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిర్దేశించిన గడువుతో కూడిన నోటీసులు మెయిల్ ఐడీ, వాట్సాప్ ద్వారా అందిచాలని ఆదేశించింది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ సిట్ ఎదుట హాజరు కాలేదని.. దీనివల్ల దర్యాప్తు ఆలస్యమవుతోందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
బీఎల్ సంతోష్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని ఏజీ అన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏజీ కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం మరోసారి నోటీసులివ్వాలని ఆదేశించింది. బీఎల్ సంతోష్కు 41ఏ సీఆర్పీసీ నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి.. బీఎల్ సంతోష్ సిట్ ఎదుట హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా అని హైకోర్టు పేర్కొంది.