అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్అర్బన్, గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.
నిలిచిపోయిన రాకపోకలు
- బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జల్లా బూర్గంపాడులో 17 సెం.మీ. వర్షం కురిసింది. ఇదే జిల్లా వెంకటాపురంలో 15 సెం.మీ. పాల్వంచలో 14, భద్రాచలంలో 13, కొత్తగూడెం, జూలూరుపాడు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 10, బయ్యారం, గార్లలలో 9 సెం.మీ. వర్షం కురిసింది. జంట నగరాల్లోనూ గురువారం పగటి పూట జల్లులు కురుస్తూనే ఉన్నాయి.
- వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 19.6 అడుగులు దాటింది. తాలిపేరు జలాశయం 18 గేట్లు ఎత్తి 61 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.
- భద్రాచలంలో బుధవారం రాత్రి 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. గురువారం సాయంత్రం 5 గంటలకు 35.5 అడుగులకు పెరిగింది. స్నానఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి. సింగరేణి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మేడిగడ్డ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల