తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 8:46 AM IST

ETV Bharat / state

విశాఖ రాంకీ ఫార్మాసిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఏపీలోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మా సిటీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్మా పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులు మూసివేశారు.

police piketing
విశాఖ రాంకీ ఫార్మాసిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో... పోలీసులు భారీగా మోహరించారు. సాల్వెంట్స్​ ఫార్మా పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులు మూసివేశారు. పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు యత్నించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు.

పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌ సంస్థలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించగా.. దాదాపు 5 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. అగ్ని ప్రమాదంపై చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:విశాఖలో అర్ధరాత్రి అలజడి... అసలేం జరిగిందంటే..?

ABOUT THE AUTHOR

...view details