తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ; మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ! - రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై మరో మూడు వారాలు యథాతథస్థితినే కొనసాగనుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుకల్పించే.. పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలు నిలుపుదల పిటిషన్లపై సెప్టెంబర్ 21 వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత రోజువారీ వాదనలు వింటామని తెలిపింది.

hearing-in-the-high-court-on-petitions-filed-in-respect-of-capital-matters
ఏపీ; మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

By

Published : Aug 27, 2020, 2:17 PM IST

పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై దాఖలైన పిటిషన్ లపై విచారణకు ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ.. ప్రభుత్వం చేసిన పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాలను జూలై 31న గవర్నర్ ఆమోదించారు. వీటిని వ్యతిరేకిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఆగస్టు 4న స్టేటస్ కో విధించింది. వీటిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. కౌంటర్​లు దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 11వరకు గడువిచ్చింది. దీనిపై అభ్యంతరాలను సెప్టెంబర్ 17లోగా తెలిపేందుకు పిటిషనర్లకు అవకాశం ఇచ్చింది.

రోజువారీ విచారణ

మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన అన్ని పిటషన్లను కలిపి విచారించేందుకు ఇక రోజువారీ విచారణను ప్రత్యక్షంగా చేపడతామని హైకోర్టు తెలిపింది. దీనిపై అందరి అభిప్రాయాలు విన్న తర్వాత కోర్టులో భౌతిక దూరం పాటిస్తూ.. విచారణ చేపడతామని చెప్పింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వారం రోజుల్లో చెబుతామని కోర్టు ప్రకటించింది.

సుప్రీంలో తిరస్కరణ

మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో స్టేటస్ కో కొనసాగుతుండగానే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై స్టేటస్ కో విధిస్తూ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. వ్యవహారం హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది. హైకోర్టులో విచారణ ప్రక్రియ తొందరగా పూర్తవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details