కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణి, సీనియర్ వైద్యశాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు సాగిన సమీక్షలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు.
29 మంది మృతి
వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1085 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని.. వారిలో 585 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి కాగా.. 29 మంది మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం 471 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలో పేర్కొన్న అధికారులు.. వైరస్ వ్యాప్తి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ ఉందని వెల్లడించారు. మొత్తం 1085 పాజిటివ్ కేసుల్లో 717 మంది నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారని చెప్పారు. మరణించిన వారిలో కూడా 82.21 శాతం మంది ఈ జిల్లాల వారు ఉన్నారని తెలిపారు.
ఏమాత్రం పట్టు వదిలినా..!