Hayatnagar young man murder case : ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసింది. అదే ఫోన్కాల్ వారి ఇరువురి మధ్య ఏర్పాడిన స్నేహ బంధం వివాహేతర బంధంగా బలపరిచింది. హాయిగా వెళ్లిపోతున్న వారి జీవితాల్లో అదే ఫోన్కాల్ వారి ప్రాణాలను బలితీసుకుంటుందని పాపం వారు ఊహించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హయత్నగర్లోని యువకుడు రాజేశ్ మృతి కేసును పోలీసులు చేధించి.. విస్మయం కలిగించే వాస్తవాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఏడాదిన్నర క్రితం రాజేశ్ ఇచ్చినా మిస్డ్ కాల్తో హయత్నగర్కు చెందిన ఉపాధ్యాయురాలు సుజాత, ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న రాజేశ్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రాజేశ్కు తన వ్యక్తి గత ఫొటోలను టీచర్ సుజాత పంపించారు. దీంతో ఆమెపై అమితంగా రాజేశ్ ప్రేమ పెంచుకున్నాడు. ఇది కాస్త వారి ఇరువురి మధ్య వివాహేత సంబంధానికి దారి తీసింది.
- ఫేస్బుక్ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్ చేస్తే..
- ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..!
Amberpet Rajesh Murder Case : ఈ క్రమంలో వారు ఇరువురు రోజు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం చేసేవారు. కొద్ది రోజుల క్రితం సుజాత.. రాజేశ్ను దూరం చేయడంతో యువకుడు మానసిక ఒత్తిడికి లోనైయ్యాడు. ఆమె కోసం ఇంటి చుట్టూ తిరిగేవాడు. తనతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చేవాడు. రాజేశ్ ప్రవర్తన నచ్చక ఆందోళనకు గురైన సుజాత చివరి సారిగా ఈనెల 24వ తేదీన ఇద్దరు కలిశారు. ఆ తరువాత ఇరువురు మాట్లాడుకొని పురుగుల మందు తాగి చనిపోవాలని బలంగా నిర్ణయించుకున్నారు.