అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కాగా.. 20 రోజుల క్రితం అత్తింటి నుంచి సౌమ్య బయటకు వెళ్లిపోయింది. తల్లి ఆమెను సముదాయించి పుట్టింటికి తీసుకొచ్చింది. మానసికంగా కుంగిపోయిన సౌమ్య ఈరోజు ఉదయం అఘాయిత్యానికి పాల్పడింది. సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌమ్య నాలుగు నెలల గర్భవతిగా డాక్టర్లు గుర్తించారు.
వరకట్నం కోసం వేధింపులు.. గర్భవతి ఆత్మహత్య - గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో గర్భవతి ఆత్మహత్య
అదనపు వరకట్నం వేధింపులు తాళలేక గర్భంతో ఉన్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వరకట్నం కోసం వేధింపులు