తెలంగాణ శాసన మండలి ఛైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డిని నియమించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముందుగా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంతా భావించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి జగదీశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుత్తాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే స్థానికంగా పార్టీలో వర్గాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సీఎం భావించినట్లు సమాచారం. సుఖేందర్తో మాట్లాడి మండలి ఛైర్మన్ పదవిని తీసుకోవాలని... కేసీఆర్ సూచించినట్లు తెలిస్తోంది. ఉపఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని... అందులో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాల్లోనే గుత్తాను ఛైర్మన్ పదవిలో నియమించే అవకాశం ఉంది.
శాసన మండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి...? - నల్గొండ ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డిని శాసనమండలి ఛైర్మన్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించినా... స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గుత్తా సుఖేందర్రెడ్డి
Last Updated : Sep 8, 2019, 8:41 AM IST