హైదరాబాద్ గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ను కరోనా తాకింది. ఇక్కడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి బయట విక్రయించే చిరు వ్యాపారికి వైరస్ సోకడం వల్ల అధికారుల్లో ఆందోళన నెలకొంది.
మార్కెట్లోని ఓ కమిషన్ ఏజెంట్ దగ్గర సదరు వ్యక్తి వారం రోజుల క్రితం పచ్చి మిర్చి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దుకాణం తో పాటు పక్కనున్న మరో ఐదు దుకాణాలను మార్కెట్ కమిటీ ఆదివారం మూసి వేయించింది.